తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్

వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులే ఇప్పుడు రాష్ట్రానికి పాపాలుగా మారాయని దుయ్యబట్టారు. ఇవాళ విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు ప్రభుత్వంపై ఏడవడం తప్ప ఏమీ చేతకాదని విమర్శించారు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే కనీసం రాష్ట్రానికి రాజధానిని కూడా నిర్మించలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రజలు టీడీపీని నమ్మేందుకు సిద్ధంగా లేరని అన్నారు.

ALSO READ: ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు.. పలువురు కలెక్టర్లకు స్థానచలనం

టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టలాగా మారిందని, రాజధానిపై తమ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సైతం వక్రీకరించి, ఆ పార్టీ అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్లు కథనాలు రాయిందని విరుచుకుపడ్డారు. రాజధాని విషయంలో వైసీపీ విధానం ఎప్పుడో చెప్పామని, దానికి కట్టుబడి ఉన్నామన్నారు. చంద్రబాబు రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు కాబట్టే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు కనీసం రాష్ట్రంలో సొంత ఇల్లు కూడా లేదు కానీ.. ఇక్కడి రాజకీయాలు కావాల? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button