![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/BALAGAM-MOVIE_V_jpg-816x480-4g-780x470.webp)
Balagam: ‘బలగం’ డైరెక్టర్ వేణు ఎమోషనల్ పోస్ట్.. ఫోటో వైరల్
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సాధారణమైన అంశాలతో తెరకెక్కిన ‘బలగం’ సినిమా విడుదలై నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. కుటుంబాల్లో భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో రూ. 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా.. రూ.23 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా, నేటికి ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దర్శకుడు వేణు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
ALSO READ: పెళ్లి పీటలెక్కబోతున్న నటి.. సీక్రెట్ గా నిశ్చితార్థం
మరోసారి నా ధన్యవాదాలు..
‘బలగం సినిమాను ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ మరోసారి నా ధన్యవాదాలు‘ అంటూ వేణు రాసుకొచ్చాడు. ఈ సినిమాలో ప్రియదర్శి , కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమాను గ్రామాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని గ్రామ ప్రజలంతా కలిసి తిలకించారు. ఇందులోని సన్నివేశాలు అందరినీ కంటతడి పెట్టించాయి.