తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Mangalagiri: ఆర్కే రాజీనామాకు గల కారణాలు ఇవే..

ఉన్నఫళంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా (Alla Ramakrishna Reddy) చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ప్రభుత్వమే వారిది కాబట్టి ఎమ్మెల్యే పదవీకాలం సంపూర్ణంగా పూర్తి చేయడం పరిపాటి. మరి అలాంటి పరిస్థితిని వదిలేసి ఆర్కే అకస్మాత్తుగా రెండు పదవులకు రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కే నాటి సీఎం చంద్రబాబును (Chandrababu) దీటుగా ఎదుర్కొన్నాడు. అమరావతి (Amaravathi) అవినీతి అక్రమాలను బయటపెట్టి చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు. మంగళగిరిలో నారా లోకేశ్ (Nara Lokesh)ను ఓడించి ఆర్కే సంచలనం సృష్టించారు. మరి అలాంటి వ్యక్తి అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఆర్కే రాజీనామా చేయడానికి గల కారణాలు ఇవే..

Also Read వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే పదవికి.. పార్టీకి ఆర్కే రాజీనామా

ప్రభుత్వం వివక్ష
రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఉన్న మంగళగిరి  (Mangalagiri) అభివృద్ధిని పట్టించుకోకపోవడం. మూడు రాజధానుల (Capital) పేరిట అమరావతిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం. విశాఖకు రాజధాని తరలింపుతో స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత. ఏడాదికి పైగా కొనసాగుతున్న అమరావతి రాజధాని ప్రాంత రైతుల ఉద్యమం.

పార్టీలో గుర్తింపు కరువు
రెండుసార్లు ఎమ్మెల్యేగా సాధించిన ఆర్కే విషయంలో వైఎస్సార్ సీపీ వివక్ష చూపుతోంది. నాటి సీఎం చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ఆర్కేకు పార్టీలో (YSRCP) ఎలాంటి గుర్తింపు లేదు. నారా లోకేశ్ ను ఓడించడంతో మంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆర్కేకు ఎలాంటి పదవి లభించలేదు. కనీసం పార్టీలో కూడా గుర్తింపు లేదు.

నిధుల లేమీ
మంగళగిరి అభివృద్ధికి (Development) రూ.1,250 కోట్లు కేటాయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఇంతవరకు మంగళగిరికి పెద్దగా కేటాయింపులు జరగలేదు. నిధులు విడుదల కాక అధికార ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆర్కే అభివృద్ధి పనులు చేయించలేకపోయారు.

తక్షణ కారణం
ఇలా వివక్ష కొనసాగుతున్న క్రమంలో పార్టీ తీసుకున్న నిర్ణయం ఆర్కేలో మరింత అసంతృప్తికి దారి తీసింది. పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని (Ganji Chiranjeevi) నియమించడం దుమారం రేపింది. అతడి నియామకాన్ని బహిరంగంగా ఎక్కడా వ్యతిరేకించికపోయినా లోలోపల ఆర్కే అసంతృప్తితో ఉన్నారు. పద్మశాలి (Padmashali) సామాజికవర్గం అత్యధికంగా ఉన్న కారణంగా మంగళగిరి నియోజవర్గానికి అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని నియమించారు. ఈ నిర్ణయమే ఆర్కే పార్టీని వీడడానికి గల కారణంగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button