CM Jagan: ప్రపంచానికే ఆదర్శం.. యువ సైన్యమే మన వాలంటీర్ వ్యవస్థ
సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న మన వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని గురువారం సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. కాగా, కార్యక్రమ వేదికపై మాజీ సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు అభినందన సభలో ఆయన మాట్లాడారు.
ALSO READ: ఏపీలో ప్రగతి రథం.. అదే జగన్ అభిమతం
ప్రతీ పేదవాడికి పథకాలు
వివక్ష లేకుండా ప్రతీ పేదవాడికి పథకాలు అందిస్తున్నాని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లుగా అవుతారన్నారు. వలంటీర్లు సేవ సైనికులని, 55 నెలలుగా పేదలకు సేవ చేశామని చెప్పారు. పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా? అని పిలుపునిచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని నా చెల్లెమ్మలు, తమ్ముళ్ల మధ్య చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వలంటీర్లు అని చెప్పుకొచ్చారు.
ALSO READ: ‘సేవా మిత్ర’ నగదు విషయంలో అసలేం జరిగింది??
వలంటీర్లు కాదు.. సేవా హృదయాలు
2.55 లక్షల మంది వలంటీర్లు కాదు.. సేవా హృదయాలు అని, అందుకే వీరికి నగదు పురస్కారాలను పెంచుతూ.. సేవావజ్ర అవార్డులకు రూ.45వేలు, సేవారత్న అవార్డులకు రూ.30 వేలు, సేవామిత్ర అవార్డులకు రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీ.. సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయని, మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆస్పత్రులు మారాయని పేర్కొన్నారు.