![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/JVK-Jagan-780x470.jpg)
CM Jagan: ‘జగనన్న విద్యాకానుక’ కిట్లపై కీలక అప్డేట్
వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం అభివృద్ధిలో దూసుకుపోతోందనే చెప్పాలి. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాల్లో సంతోషాలు నింపుతున్నారు. అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యా దీవెన వంటి అద్భుత పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తును బంగారుబాటలో నడిపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘విద్యాకానుక’ పథకం ద్వారా ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
ALSO READ: పేదలకు, పెత్తందారులకు యుద్ధం.. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్
39,51,827 మంది విద్యార్థులకు కిట్లు
‘విద్యాకానుక’ పథకానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా మరో శుభవార్తను చెప్పింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44,617 పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న 39,51,827 మంది విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన ‘విద్యాకానుక’ కిట్లను అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకు రూ. వెయ్యికోట్ల నిధులను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు విద్యా కానుక (జేవీకే–5) కిట్లను అందిస్తామని స్పష్టంచేశారు.
ALSO READ: రాజకీయ చరిత్రలో తొలిసారి..నరసరావుపేట ఎంపీ టికెట్ బీసీకే!
కిట్లో ఏమేం ఉంటాయంటే?
ప్రభుత్వం అందిస్తున్న విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లిష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు. దీంతో పాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ ఉంటుంది. అంటే, ఈ కిట్ ద్వారా ప్రతి విద్యార్థి 2,400 రూపాయల లబ్ధిని పొందుతారు. అంతేకాదు, ఈ కిట్లో అందించిన ప్రతి వస్తువు ఎంతో నాణ్యతతో కూడి ఉంటుంది. ఈ కిట్కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా 4 దశల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు.