![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/05/Massive-Crowd-Attend-In-CM-YS-Jagan-Election-Campaign-At-Bobbili-1.jpg)
CM YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే బాబుకు తెలుసా? సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలీదేమో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి తెలుసని, జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదని సీఎం జగన్ అన్నారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఈ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే బాబుకు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు.
ALSO READ: వాలంటీర్ వ్యవస్థను రూపుమాపేందుకు చంద్రబాబు మరో కుట్ర!
సర్వహక్కులు కల్పించడమే..
మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగిందని.. ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదన్నారు. ఇప్పటికీ కొన్ని భూములు కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్లూ తిరుగుతున్నాయన్నారు. కొంతమంది డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారే తప్పా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అందుకే ఈ వ్యవస్థ మారాలని, ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించామన్నారు. అలాంటి ఈ కార్యక్రమంపై దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు.
ALSO READ: కూటమిలో లుకలుకలు.. ఉమ్మడి మేనిఫెస్టో వేదికపై కనిపించని మోదీ ఫోటో!
మళ్లీ మోసపోవద్దు
రానున్న ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే పథకాల కొనసాగింపు ఉంటుందన్నారు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు ఉంటుందని చెప్పారు. మళ్లీ మోసపోవద్దని, రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలు..పథకాల కొనసాగింపును నిర్ణయించేవి అని వెల్లడించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరగని సామాజిక న్యాయం కళ్లెదుటే కనిపిస్తోందన్నారు. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించామన్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు.
9398993029