తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: పిఠాపురానికి మకాం మార్చిన పవన్..!

జనసేనాని పవన్ కళ్యాణ్‌‌కు తాను పోటీ చేసే స్థానంపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. గతంలో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేంందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. భీమవరంలో వైసీసీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో జనసేన సందిగ్ధంలో పడిపోయినట్లు సమాచారం. ముందు నుంచి కాపు ఓట్లనే నమ్ముకున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరంలో శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. గ్రంథి శ్రీనివాస్ కూడా ఆషామాషీ నాయకుడేం కాదు. ఆయన కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. కాపుల్లో ఆయ‌నకు బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. అంతేకాదు, భీమ‌వ‌రంలో పోటీ చేస్తే క్ష‌త్రియులు, ఇత‌ర సామాజిక వ‌ర్గాలు త‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తాయ‌ని ప‌వ‌న్ భ‌య‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. అందుకే పిఠాపురానికి మకాం మార్చినట్లు తెలుస్తోంది.

ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్.. హిమాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలనున్న ప్రభుత్వం?

చంద్రబాబు నాయుడు సైతం పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఎటూ తేల్చుకోలేేకపోతున్నారట. ఇప్పటికే పలు స్థానాలను పరిశీలించిన ఆయన.. పిఠాపురం, గాజువాక, తిరుపతి నియోజక వర్గాలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో పిఠాపురానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక్క‌డ అత్య‌ధికంగా కాపులుండ‌డంతో పనవ్ సైతం పిఠాపురం వైపునకే మొగ్గు చూపుతున్నారట. కాపులపై గెలుపు భారాన్ని వేసి పిఠాపురం నుంచే పోటీ చేయాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. మరి పవన్ ‘కాపు’ అస్త్రం ఈ ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తోందో చూడాలి.

6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button