Baryl Vanneihsangi: ఎమ్మెల్యేగా గెలిచిన టీవీ యాంకర్.. ఎవరో తెలుసా?
ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్’ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 40 స్థానాల్లో జెడ్పీఎం ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార ‘మిజో నేషనల్ ఫ్రంట్’ పార్టీకి 10 స్థానాలు రాగా.. బీజేపీ 2, కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో జెడ్పీఎం అభ్యర్థిగా ఓ టీవీ యంకర్ బారిల్ బరిలోకి దిగి మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్నున్మావియాపై 9.370 మెజార్టీ ఓట్లతో గెలిచి రికార్డు సాధించింది. కాగా, ఆమె వయస్సు కూడా 32 ఏళ్లే కావడంతో అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించింది.
ALSO READ: మళ్లీ 29 ఏళ్లకు హస్తగతం.. రామగుండం ఓట్ల ముచ్చట
యాంకర్ టూ ఎమ్మెల్యే..
మిజోరాంలో 1991లో జన్మించిన బేరిల్ మేఘాలయాలోని షిల్లాంగ్లో నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ను అభ్యసించింది. తర్వాత ప్రముఖ టీవీలో యాంకర్గా కెరీర్ను ప్రారంభించిన ఆమె.. సోషల్ మీడియా ఇన్స్టాగ్రాంలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. క్రమంగా రాజకీయాలపై ఆసక్తితోపాటు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలో తనదైన ముద్ర వేసుకొని ప్రజలకు మరింత చేరువైంది. గతంలో ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేసిన బేరిల్.. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచింది.