![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/modi-3.jpeg)
జాతీయం
Cassandra: జర్మనీ గాయని భక్తి పాట… దరువేసిన ప్రధాని మోదీ… వీడియో వైరల్
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్ మాన్ శ్రీరాముడి భక్తిగీతం పాడడం, ఆ వీడియో గురించి ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్, సోషల్ మీడియాలో స్పందించారు. ఆ జర్మనీ గాయని తన తల్లితో కలిసి భారత్ రాగా… వారిని ప్రధాని మోదీ కలుసుకున్నారు.
Also Read: వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా
తమిళనాడులోని పల్లడం వద్ద కసాండ్రా మే స్పిట్ మాన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆమె ‘అచ్యుతమ్ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా… మోదీ తన చేతులతో దరువేస్తూ ఆమె పాటను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జర్మనీ జాతీయురాలైన కసాండ్రా మే స్పిట్ మాన్ అనేక భారతీయ భాషల్లో భక్తి గీతాలు పాడుతూ గుర్తింపు పొందారు.
One Comment