తెలుగు
te తెలుగు en English
జాతీయం

Himachal: కాంగ్రెస్ పార్టీకి షాక్.. హిమాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలనున్న ప్రభుత్వం?

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. వారు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెెస్ బలం మైనారిటీకి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రతిపక్షమైన బీజేపీ ఇవాళ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో బలం పడిపోయినందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. దీనిపై గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తిగా మారింది.

ALSO READ: ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68. కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు కూడా బీజేపీకి ఓటు వేయడంతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా 34కు పెరిగింది. ఆరుగురు సభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్‌ బలం 34కు పడిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఒక్క సభ్యుని మద్దతు కూడగట్టడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆ ఒక్క సభ్యుడి మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో హిమాచల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button