తెలుగు
te తెలుగు en English
జాతీయం

Himachal Pradesh: హిమాచల్‌లో రాజకీయ సంక్షోభం.. రంగంలోకి ట్రబుల్ షూటర్ డీకే

హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. వీరంతా బీజేపీలో చేరుతార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 20 మందికి గాయాలు

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు నిన్న వార్తలు వచ్చాయి. కానీ తాను రాజీనామా చేయలేద‌ని, బీజేపీ నేత‌లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన నిన్న సాయంత్రం స్పష్టంచేశారు. అసెంబ్లీలో బల నిరూపణకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దించింది. ఇప్పటికే ఆయన ఆ రాష్ట్రానికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలతో పాటు, ఇండిపెండెంట్లతోనూ ఆయన మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. డీకే వెంట పార్టీ సీనియర్ నేతలు భూపేశ్ బఘేల్, భూపేందర్ సింగ్ ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button