తెలుగు
te తెలుగు en English
జాతీయం

SBI: ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టులో విచారణ… ఎస్‌బీఐకి కీలక ఆదేశాలు

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ)ను ఆదేశించింది. అంతేకాదు, ప్రతి బాండ్ క్రమసంఖ్య కూడా అందులో పేర్కొనాల్సిందేనంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read: రూట్ మార్చిన బాబు.. తిట్టిన నోటితోనే మోదీపై పొగడ్తల వర్షం!

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్‌బీఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు అధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపింది. అంతేకాదు తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్‌ను ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button