తెలుగు
te తెలుగు en English
జాతీయం

Supreme Court: పౌరసత్వ సవరణ చట్టం… స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

కేంద్రప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని అమలు చేయకుండా స్టే విధించాలని కోరుతూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఏఏ వల్ల నిర్దిష్ట మతాలకు మాత్రమే పౌరసత్వం దక్కుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇది ప్రాథమికంగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొంది.

Also Read:  సికింద్రాబాద్- విశాఖ కొత్త వందేభారత్ రైలు.. ప్రారంభించిన మోడీ

మరి ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా..? అన్నది ఆసక్తిగా మారింది. ఒక వేళ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సీఏఏ అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్​ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్​ నుంచి భారత్ కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్​ క్లియర్​ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button