తెలుగు
te తెలుగు en English
జాతీయం

West Bengal: హస్తం పార్టీకి షరతు విధించిన మమతా… దానికి సమ్మతమైతేనే దోస్తీ

త‌మ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే సీపీఎంతో కాంగ్రెస్ తెగ‌దెంపులు చేసుకోవాల‌ని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ హ‌స్తం పార్టీకి ష‌ర‌తు విధించారు. సీట్ల స‌ర్దుబాటు చ‌ర్చ‌ల సంద‌ర్భంగా తాను కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వ‌చూపితే తిర‌స్క‌రించార‌ని, ఇక ఇప్పుడు తాను ఒక్క సీటు కూడా ఇచ్చేది లేద‌ని దీదీ స్ప‌ష్టం చేశారు.

Also Read: ఉచిత బస్సు ప్రయాణం… హైకోర్టులో విచారణ వాయిదా

గ‌తంలో సీపీఎం త‌నపై ప‌లుమార్లు భౌతిక దాడులు చేసింద‌ని, త‌న‌ను నిర్ధాక్షిణ్యంగా కొట్టార‌ని, శ్రేయోభిలాషుల ఆశీస్సుల‌తోనే తాను బతికి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని దీదీ గుర్తుచేశారు. లెఫ్ట్‌ను తాను ఎన్న‌డూ మ‌న్నించ‌న‌ని, సీపీఎంను అస‌లు విడిచిపెట్టేది లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీపీఎంతో జ‌ట్టు క‌ట్టిన‌వారిని తాను మ‌రువ‌న‌ని అన్నారు.

Also Read: విద్యా వ్యవస్థలో మరో ఘట్టం.. ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం

మ‌మ‌తా బెన‌ర్జీ మాల్ధాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాను కాంగ్రెస్‌కు రెండు లోక్‌స‌భ స్ధానాలు ఇచ్చి వారిని గెలిపించుకుంటానంటే వారు ఎక్కువ స్ధానాల‌ను కోరుకున్నార‌ని, మీరు లెఫ్ట్‌తో జ‌ట్టుక‌డితే తాను వారికి ఒక్క సీటు కూడా ఇవ్వ‌న‌ని చెప్పాన‌ని దీదీ తేల్చిచెప్పారు. ఇక బెంగాల్‌లో సీపీఎంతో పొత్తు ఉండ‌బోద‌ని సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి గ‌తంలో వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button