![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/IAS-Amrapali.jpg)
Amrapali: అమ్రపాలికి మరో కీలక బాధ్యతలు… హెచ్జీసీఎల్ బాధ్యతలు అప్పగింత
యువ ఐఏఎస్ అమ్రపాలికి ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు కట్టబెట్టింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ కె. ఆమ్రపాలికి అప్పగించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం. దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్ఎండీఏ ఐటీ, ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా ఉన్నారు.
Also Read: నా సైన్యం, బలం మీరే.. ‘సిద్ధం’ సభలో జగన్
కాగా, హెచ్ఎండీఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న దానకిశోర్ ఈ నెల 6న హెచ్ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడ తీరికలేకుండా గడిపారు. వివిధ ప్రాజెక్టులు, అత్యవసరంగా పరిష్కరించాల్సిన దరఖాస్తులను అధికారులతో కలిసి సమీక్షించారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా ఐఏఎస్లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమ్రపాలి. విశాఖలో విద్యాభ్యాసం అనంతరం.. 2010 యూపీఎస్సీ సివిల్స్లో సత్తాచాటి.. 39వ ర్యాంక్ సాధించారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్గా, జాయింట్ కలెక్టర్గా, నగర కమిషనర్గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె డిప్యుటేషన్పై పీఎంవోలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు.