Hyd: కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్.. ఏపీ నుంచి ప్రత్యేకంగా రాక
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శస్త్ర చికిత్స చేసుకుని విశ్రాంతి పొందుతున్న కేసీఆర్ ను పరామర్శించేందుకు జగన్ ప్రత్యేక విమానంలో ఏపీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.
Also Read ఈసారి ప్రజలకు నిరాశే.. పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన
బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్ ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. జగన్ ను ఆలింగనం చేసుకుని కేటీఆర్ ఇంట్లోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ గదిలోకి సీఎం జగన్ వెళ్లి మాట్లాడారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.
Also Read జనవరి 04: చరిత్రలో ఈరోజు..
డిసెంబర్ 7వ తేదీన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కేసీఆర్ జారి పడిపోయారు. వెంటనే హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు తుంటి ఎముక మార్పిడి చేయాలని శస్త్ర చికిత్సచేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో వారం పాటు చికిత్స పొందిన కేసీఆర్ అనంతరం డిశ్చార్జయ్యారు.