![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/అసెంబ్లీ-780x470.png)
Assembly: తెలంగాణ అసెంబ్లీ వాయిదా…. ఈరోజు ఏం జరిగిందంటే?
తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. కృష్ణా జలాల వాటాపై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుమందు సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. మరోవైపు ఇంత కీలకమైన సమావేశాలకు మాజీ CM, విపక్ష నేత KCR హాజరుకాకపోవడాన్ని CM రేవంత్రెడ్డి తప్పుపట్టారు.
Also Read: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్… క్షమాపణ చెప్పాలని డిమాండ్
దీనికి బీఆర్ఎస్ నేతలు కూడా స్ట్రాంగ్గానే స్పందించారు. అధికారపక్షం ప్రస్తావించిన ప్రతి అంశానికి.. BRS నుంచి కౌంటర్ అదే స్థాయిలో వచ్చింది. ఓ దశలో వ్యక్తిగత విమర్శల సైతం చేసుకున్నారు. కృష్ణానది జలాల విషయంలో ముమ్మాటికీ తెలంగాణకు అన్యాయం చేసింది గత BRS ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి సహా, కాంగ్రెస్ మంత్రులంతా ముక్తకంఠంతో చెప్పారు.