తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BJP MLA’s: ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. మనసులో మాట చెప్పిన రాజాసింగ్

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఎనిమిది మంది కాషాయం పార్టీ నేతలు ప్రమాణం చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసిగా ప్రొటెం స్పీకర్ గా ఉన్న సభకు తాము హాజరుకాబోమని ప్రకటించి.. సభను బహిష్కరించారు. ఇక సీనియర్లను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసుకునేందుకు అక్బరుద్దీన్‌కు అవకాశం ఇవ్వడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదు. 15 నిమిషాలు ఆగితే హిందువులను చంపేస్తానని చెప్పిన వ్యక్తి నాయకత్వంలో ప్రమాణం చేయనని రాజాసింగ్ తేల్చి చెప్పారు. ఎట్టకేలకు నేడు స్పీకర్ ఎన్నిక జరగడంతో తమ పంథం నెగ్గించుకున్నారు.

వీరిలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఇటీవల ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.

Also read: Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం.. గడ్డం ప్రసాద్ కుమార్ నియామకం

అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయమని చెప్పామని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే లు అంత స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని తెలిపారు. ఇచ్చిన గ్యారెoటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుంది ? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా…? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైందని అన్నారు.

మనసులో మాట బయటపెట్టిన రాజాసింగ్

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా అని తన మనసులోని మాటను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బయట పెట్టారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. మంచి వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా 8 మందిమి కలిసి పనిచేస్తామన్నారు. నేను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదన్నారు. ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు కేసులు పెడితే వాళ్లపైనే పెట్టుకోవాలని తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button