Seethakka: మహిళలకు ఉచిత బస్సు కావాలా,వద్దా… హరీష్ రావుపై సీతక్క ఫైర్
అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలకు దారి తీసింది. ఆటోడ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. అయితే హరీష్ రావుపై మంత్రి సీతక్క అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్సు కావాలా.. వద్దా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య అని నిలదీశారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు
భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల నైజమని తెలిపారు. హరీష్ రావును ఉద్దేశిస్తూ మీకు అగ్గిపుల్ల దొరకలేదు.. వందల మంది పిల్లలు చనిపోయారని ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్ సైతం హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం 530 కోట్లు వెచ్చించిందన్నారు. పదేళ్లలో ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి రూపాయలయినా ఇచ్చారా? అని పొన్నం ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు 60 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.