తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth Reddy: మాజీ సీఎం వద్దకు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఎర్రవల్లి ఫాం హౌస్ లో జారిపడిన ఆయనను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎడమ తొంటి ఎముక విరిగిందని.. శస్త్రచికిత్స చేశారు.

కాగా.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు వివరాలు ఆరా తీసారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే యశోద ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఇక కేసీఆర్ ను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యులు కూడా కేసీఆర్ ను పరామర్శించనున్నారు.

Also read: World’s Biggest Office: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్.. డిసెంబర్ 17న ప్రధాని ప్రారంభం

శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు. అయితే కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్‌ విజ‌య‌వంత‌మైంద‌ని, ఆయ‌న కోలుకుంటున్నార‌ని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాక‌ర్ సాయంతో కేసీఆర్ న‌డుస్తున్నార‌ని చెప్పారు. మ‌రో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button