తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు లక్ష, తులం బంగారం

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లల కుటుంబాలకు ప్రభుత్వం తీపికబురు చెప్పనుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రూ. లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు సూచించారు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు చేపట్టాలన్నారు.

Also read: BJP: ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ.. పలు రాష్ట్రాలకు ఇంఛార్జుల నియామకం

గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించాలని.. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని సూచించారు. మరోవైపు బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్ తో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button