![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/05/1077269-revanthreddy-780x470.webp)
CM Revanth: తెలంగాణలో రేవంత్ మార్క్ పాలన!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి, రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన మార్క్లో పాలన సాగిస్తున్నారు. పాలనలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమూలంగా మారుస్తున్నారు. లేదా వాటిలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. టీఎస్ని టీజీగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర నూతన అధికార గీతాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు.
ALSO READ: ఏపీ నెక్ట్స్ సీఎం ఎవరు? విశాఖలో జోరుగా సాగుతున్న బెట్టింగ్!
కేసీఆర్ అధికారంలో ఉండగా తెలంగాణ రాష్ట్ర అధికార గీతంపై కసరత్తు చేసినా ప్రజల ముందుకు తేలేకపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద శ్రద్ధ పెట్టారు. అందెశ్రీ ఎప్పుడో రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ఆవిష్కరించబోతున్నారు. సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి తుది మెరుగులు దిద్దుతున్నారు. కీరవాణి మూడు వెర్షన్లు తయారుచేశాడు. ఒక వెర్షన్ స్కూల్స్లో ప్రేయర్గా ఉంటుంది. మరోటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆలపిస్తారు. ఇంకోటి జనరల్ గా ఉంటుంది. ఇక తెలంగాణ స్టేట్ (టీఎస్)ను తెలంగాణ (టీజీ) గా మార్చారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఉద్యమకారులు గోడల మీద టీజీ పేరుతోనే నినాదాలు రాసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ప్రభుత్వ అధికారిక ముద్రలో (ఎంబ్లెమ్) మార్పులు చేయాలని నిర్ణయించారు. దాని మీద కూడా కసరత్తు సాగుతోంది. ఇప్పుడున్న అధికారిక ముద్రలో రాచరిక చిహ్నాలు ఉన్నాయని రేవంత్ భావన.
2 Comments