![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/Teenmar_Mallanna_Win_5e53115f88_V_jpg-799x414-4g-780x414.webp)
CNG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం
నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలుపొందారు. మూడు రోజులుగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో.. మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థితో పాటు 43 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేట్ కావడంతో తీన్మార్ మలనాన్న విజయం సాధించారు. జూన్ 5న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు కొనసాగింది.
ALSO READ: అక్షరయోధుడు రామోజీరావు అస్తమయం
రెండో ప్రధాన్యత ఓటులో మల్లన్నకు రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. అయితే, ముందు నుంచీ తీన్మార్ మల్లన్న ఆధిక్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్లోనూ పోటీ ఇవ్వలేకపోయారు. చివరకు రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతోనే తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది. 14 వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉండటంతో మల్లన్న విజయం అందుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మల్లన్నకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందించారు.
రాకేష్ రెడ్డికి ‘రెండో ప్రాధాన్యం’ దెబ్బ
స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్, బీజీపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిలకు 73,110 తొలి ప్రాధాన్యతా ఓట్లు పడగా వీటిలో సుమారు 20 వేల బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓట్లు వేయలేదు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లు తనకే వస్తాయని ధీమాగా ఉన్న రాకేష్ రెడ్డి చివరకు ఆ ఓట్లు కోల్పోయి ఓటమిని అంగీకరించారు. ఓడినా ప్రజల మధ్యనే ఉంటానని తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్కు, ఓటేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, పట్టభద్రులందరికీ రాకేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తీన్మార్ మల్లన్న గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అనుచరులు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.
One Comment