తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Janasena: తెలంగాణలో ప్రభావం చూపించని పవన్… డిపాజిట్లు గల్లంతు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు తమ హవా కొనసాగిస్తున్నారు. అయితే తెలంగాణలో తొలిసారి పోటీచేసిన పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన ఘోర పరాభవం చవిచూసింది. పోటీచేసిన అన్నిస్థానాల్లోనూ గ్లాస్‌ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేనాని స్వయంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ కనీసం పోటీలో నిల్వలేకపోయింది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న జనసేన.. ఎనిమిది స్థానాల్లో పోటీచేసింది. ఈ అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు.

Also Read: మార్పు కోరుకున్న తెలంగాణ ప్రజలు… ఈ విజయం వారిదే: డీకే శివకుమార్

ఓటమి బాటలో ప్రముఖులు

ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసింది. ఇక బీజేపీ 88 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా ఆ పార్టీ అతిరథ మహారథులు ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అపజయం మూటగట్టుకుంది. బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, ఈటల రాజేందర్‌ కూడా ఓటమి బాటలో పయణిస్తున్నారు.

Also Read: రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ, ఇతర పోలీస్ అధికారులు..

కలిసిరాని పొత్తు

తెలంగాణలో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతుందనుకున్న జనసేన పార్టీ బీజేపీ అధిష్టానంతో పవన్ కు ఉన్న సన్నిహిత్యం, ప్రధాని మోడీ కొరిక మేరకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్ లోకి దిగారు. ఆ తర్వాత పవన్ , బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలుమార్లు చర్చించుకున్న అనంతరం జనసేనకు 8 స్థానాలను కేటాయించారు. కానీ పవన్ ప్రభావం ఏ మాత్రం కూడా తమ అభ్యర్థులు గెలుపొందేలా చేయలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button