Congres Party.. 100 రోజుల్లో 6 గ్యారంటీలు పక్కా.. నేను గ్యారంటీ
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు (Guarantees) పక్కా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధిర అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేరుస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెస్ మేనిఫెస్టో ఓటర్లకు వివరించారు.
Also Read పక్కా కాంగ్రెస్ దే విజయం.. ఇదిగో సాక్ష్యం
అనంతరం భట్టి ప్రసంగిస్తూ.. 6 గ్యారంటీలు అమలుకు నిధులు ఎక్కడివని సీఎం కేసీఆర్ ప్రశ్నించడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. మరి బీఆర్ఎస్ మేనిఫెస్టో అమలుకు నిధులు ఎక్కడివని నిలదీశారు. ఎవరిని మోసం చేస్తారు? ఎంతకాలం ప్రజలను మభ్య పెడతారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని తెలిపారు. దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందని ప్రకటించారు. ప్రజలందరూ హస్తం పార్టీ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
Also Read నీచ రాజకీయం.. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర