MIM: మసీదుల కోసం పోరాడితే అల్లా సహాయం చేస్తాడు: అసదుద్దీన్
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ మరోసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మదర్సాలు, ఇస్లాం కోటలను ఆక్రమించుకోవడం కోసం అధికారంలో ఉన్నవారు చూస్తున్నారన్నారు. మసీదుల విషయంలో ముస్లిం సమాజానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాటిని కాపాడుకోవాల్సి వస్తుందని ప్రకృతి చెబుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కారు మసీదులను నిర్మానుష్యంగా మార్చాలని చూస్తోందన్నారు. ముస్లింలంతా విభేదాలు మరచి ఒక్కతాటిపైకి రావాలని కోరారు. మసీదుల కోసం పోరాడితే అల్లా సహాయం చేస్తాడన్నారు.
Also Read: మంత్రి దామోదర ఫేస్ బుక్ పేజీలో టీడీపీ పోస్ట్
ముస్లింల అస్తిత్వాన్ని నాశనం చేసే శక్తులతో పోరాడాలని పిలుపునిచ్చారు. ముస్లిం యువత సంఘటితమై సమాజాన్ని కాపాడుకోవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు యాక్టివిటీస్పై ఫోకస్ పెంచాలని పిలుపునిచ్చారు. ముస్లీం సమాజం పట్ల శ్రద్దతో మసీదులను జనాభాతో ఉంచాలని ఒవైసీ పిలుపునిచ్చారు. అయితే, ఒవైసీ ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు చాలా సార్లు ఇచ్చాడు. ఇంతకు ముందు కూడా ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చాడు.