తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Prajapalana: తెలంగాణలో మొదలైన ప్రజాపాలన.. వసూళ్లకు తెరలేపిన దళారులు

తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ప్రకటించిన పథకాలకు ఒకే దరఖాస్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతుభరోసా, మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల సమస్యలకు సంబంధించి ఒకే దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.

Also read: Russia President: ప్రధాని మోడీకి రష్యా ఆహ్వానం.. తమ దేశం రావాలని పుతిన్ పిలుపు

ఇక నేటి నుంచి రాష్ట్రంలో పలు చోట్ల గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తోంది. ఈ ప్రజాపాలన సభలకు ప్రజలు పోటెత్తారు. తమ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు రాగా.. అప్లికేషన్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తులను అందించేందుకు భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో అప్లికేషన్లు సమర్పించేందుకు అధికారులతో గొడవకు దిగారు. మరోవైపు ప్రజాపాలన దరఖాస్తులను అమ్ముకుంటూ కొందరు దళారులు దోపిడీకి తెరలేపారు. దీంతో పలుచోట్ల వారిని ప్రజలు నిలదీశారు. మరికొందరు డబ్బులిచ్చి మరీ దరఖాస్తులను కొనుగోలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button