Protem Speaker: కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయకార ఒప్పందం… కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకుంటోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం వెనకున్న ఉద్దేశం ఇదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో శాసన సభ సంప్రదాయాన్ని కాలరాసిందంటూ మండిపడ్డారు.
Also Read: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన కామెంట్స్… ఇది దేనికి సంకేతం?
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ
సభలో సీనియర్లను పక్కన పెట్టి ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని బయటపెడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరగకూడదని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నికయ్యాకే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: ఓం బిర్లాతో రేవంత్ భేటీ… లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
ప్రోటెన్ స్పీకర్ గా అక్బరుద్దీన్
కాంగ్రెస్ కు ఎంఐఎంకి లోపాయకార ఒప్పందం బయట పడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎంఐఎం, బీజేపీ ఒకటి అని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ లని కాదని దొడ్డిదారిన అక్బరుద్దీన్ ను ప్రోటెన్ స్పీకర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.