Telangana: కేసీఆర్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవే..
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుండగా.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మాత్రం దాదాపు పదేళ్ల అధికారాన్ని కోల్పోయింది. ఫుల్ జోష్ తో ఎన్నికలకు సిద్ధమైన గులాబీ దళం ఎన్నికల సమయంలో మాత్రం డీలా పడింది. కాంగ్రెస్ గాలి వీస్తోందని స్పష్టంగా తెలుసుకున్న కేసీఆర్ (KCR) ‘నేను ఓడిపోతే ఇంటికిపోయి పడుకుంటా’ అని ప్రకటించడంతోనే ఆయన ఓటమిని ఖాయం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని అధికారం చేపట్టబోతున్నది. అయితే ఇంతలా బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూడడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఇంత స్థాయిలో ఉందని ఎవరూ ఊహించలేదు. గులాబీ పార్టీ వాడిపోవడానికి చాలా చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండగా.. అవినీతి, అక్రమాలు భారీగా దెబ్బతీశాయి.
Also Read రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ, ఇతర పోలీస్ అధికారులు..
బీఆర్ఎస్ ఓటమికి కారణాలు
- పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి ఉంది.
- కేసీఆర్ వ్యవహార శైలి. నియంతలాగా వ్యవహరించడం.. ముక్కుసూటిగా వెళ్లడం.
- బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
- పార్టీ అభ్యర్థులను మార్చకుండా సిట్టింగ్ లకే మరోసారి అవకాశం ఇవ్వడం.
- పార్టీ ఎమ్మెల్యేలు అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలకు పాల్పడడం.
- బీఆర్ఎస్ ఓటమిలో నిరుద్యోగులు ప్రధాన పాత్ర పోషించారు. ఉద్యోగాల ప్రకటన లేకపోవడం.. పేపర్లు లీక్ లు.
- ఇచ్చిన హామీలు మరువడం. నిరుద్యోగ భృతి, దళిత బంధు, మూడెకరాల భూమి పంపిణీ వంటి హామీలు మరవడం.
- పార్టీ ఫిరాయింపులు చేటు చేశాయి.
- బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు.
- ప్రజలకు అందుబాటులో లేకపోవడం