Telangana Assembly Elections: మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు.. ఎవరంటే?
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. అయితే.. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ ఎన్నికల్లో మొదటి సారి గెలిచారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినవాళ్లు, ఈసారి మాత్రం పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు ఆశీర్వదించారు. ఈసారి వీరు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనే అవకాశం దక్కింది. అయితే వారిలో అతి చిన్న వయస్సు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు.
Also read: Warangal: ఉమ్మడి ఓరుగల్లులో హస్తం హవా.. కొట్టుకుపోతున్న గులాబీ అభ్యర్థులు
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో పాలకుర్తి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత.. మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్రావు పద్మాదేవేందర్రెడ్డిపై విజయం సాధించారు. అంతేకాకుండా.. వేములవాడలో కాంగ్రెస్ నుంచి ఆదిశ్రీనివాస్ విక్టరీ సాధించారు. అటు.. రామగుండంలో మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంటోన్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత తొలిసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్నేత జానారెడ్డి కుమారుడు జయవీర్రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అంతేకాకుండా.. నాగర్కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్మోహన్రావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి మందుల సామెల్.. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ వెళ్లనున్నారు.