తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: రేషన్‌కార్డుల ఈ-కేవైసీ పై కీలక ఆప్డేట్… చివరి తేదీ ప్రకటన

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులకే బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రేషన్‌కార్డుల వెరిఫికేషన్‌ను ప్రారంభించారు. కుటుంబ యజమానితో పాటు కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడు తమ ప్రాంతంలోని ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్లి KYCని చేయించుకోవాలి. రేషన్ షాపుల్లో మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అన్ని జిల్లాల పౌరసరఫరాల అధికారులు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: అదిరిపోయే శుభవార్త.. న్యూ ఇయర్ వేళ మెట్రో కీలక నిర్ణయం

తెలంగాణలో రెండు నెలలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీకి జనవరి 31 తుది గడువని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అప్రమత్తం చేశారు.

Also Read: మెగా డీఎస్సీ… అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ 70.80 శాతం పూర్తయ్యిందని వెల్లడించారు. 87.81 శాతం నమోదుతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ప్రథమ స్థానంలో, అతి తక్కువగా 54.17 శాతంతో వనపర్తి జిల్లా చివరి స్థానాల్లో నిలిచాయని ఉత్తర్వుల్లో తెలిపారు. రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును చౌకధరల దుకాణాల్లో డీలర్లు సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button