తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Times now survey: లోక్‌సభ ఎన్నికలపై సర్వే.. బీఆర్ఎస్‌కు ఎన్ని స్థానాలంటే?

దేశ వ్యాప్తంగా వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై తాజాగా టౌమ్స్ నౌ, ఈటీజీ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం బీజేపీకి 308 నుంచి 328 సీట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ పార్టీ 52 నుంచి 72 సీట్లు రానున్నట్లు తెలిపింది. ఇక వైఎస్సార్ సీపీ 24 నుంచి 25 సీట్లు, డీఎంకే 20 నుంచి 24, టీఎంసీ 20 నుంచి 24, బీజేడీ 13 నుంచి 15, బీఆర్ఎస్ 3 నుంచి 5, ఆమ్‌ ఆద్మీ పార్టీ 4 నుంచి 7, ఇతరులు 66 నుంచి 76 స్థానాలు దక్కించుకుంటున్నట్లు తేలింది.

ALSO READ: మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి అమ్మకాలు బంద్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే హవా

లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే హవా అని టౌమ్స్ నౌ, ఈటీజీ సర్వే సంస్థ ప్రకటించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు చేజిక్కించుకుంటుందని వెల్లడించింది. తర్వాత స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 10 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 5 స్థానాలు, బీజేపీ 3 నుంచి 5 స్థానాలను, ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button