TS Elections: రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత నాదే.. బండి సంజయ్
ప్రశ్నించే గొంతుకను నేనని.. అంతిమ నిర్ణయం మీదే అని బీజేపీ కరీంనగర్ అభ్యర్ధి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దీపావళి పండగ సందర్భంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ మేరకు శ్రీ లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సు, కొత్త ఆలోచనలను తేవాలన్నారు. మీ జీవితం ఆనందమయం కావాలని మనసారా కోరుకున్నారు.
చదవండి: చెర్రీ నివాసంలో దీపావళి.. తరలివచ్చిన తారలు
ప్రజా సమస్యలపై యుద్ధం
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలతోపాటు కేసీఆర్పై యుద్దం చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలుప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. పోరాడుతున్న నన్ను అణిచివేసేందుకు ఇప్పటివరకు 74 కేసులు పెట్టిన భయపడలేదన్నారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగత పెరిగిపోయిందని, బీజేపీ అధికారలంలో వస్తే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కావున బీజేపీకి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. అనంతరం బండి సంజయ్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కాగా బండి సంజయ్ను గెలిపించాలంటూ పట్టణంలో యువకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.