తెలంగాణ
TS Elections: బీజేపీ తుది జాబితా విడుదల.. చివరి నిమిషంలో 14మందికి అవకాశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావడంతో తుది జాబితాను బీజేపీ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు సాయంత్రంలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. కాగా, వీరికి ప్రచారానికి సైతం మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో ఈ సమయం వారికి చాలా కీలకం కానుంది.
బీజేపీ అభ్యర్థులు వీరే..
- మల్కాజ్గిరి – రామచంద్రరావు,
- శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్,
- పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్,
- బెల్లంపల్లి(SC) – కొయ్యాల ఎమాజీ,
- సంగారెడ్డి – దేశ్పాండే రాజేశ్వరరావు,
- మేడ్చల్ – సుదర్శన్ రెడ్డి,
- చాంద్రాయణ గుట్ట- మహేందర్,
- సికింద్రాబాద్ కంటోన్మెంట్(SC) – గణేష్ నారాయణ్,
- దేవరకద్ర – కొండా ప్రశాంత్ రెడ్డి,
- వనపర్తి – అనుఘ్నారెడ్డి,
- అలంపూర్(SC) – మేరమ్మ,
- నర్సంపేట – కె. పుల్లారావు,
- మధిర(SC) – విజయరాజు,
- నాంపల్లి – రాహుల్ చంద్ర.