తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Government: ప్రజాపాలన.. మూడు రోజుల్లో దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే?

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పాలన నిర్వహిస్తోంది ఈ కార్యక్రమం డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైంది. కాగా, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో ప్రజా పాలనకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి సైతం విశేష స్పందన వస్తున్నట్లు సీఎస్ ​శాంతి కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ మూడు రోజుల్లో మొత్తం 40,57,592 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు.

ALSO READ: రేషన్‌కార్డుల ఈ-కేవైసీ పై కీలక ఆప్డేట్… చివరి తేదీ ప్రకటన

ఒక్కరోజే 18,29,107 దరఖాస్తులు

రాష్ట్రంలోని 1,991 గ్రామాలు, 1,877 మున్సిపల్​వార్డుల్లో శనివారం నిర్వహించిన ప్రజాపాలనలో ఒక్కరోజే 18,29,107 దరఖాస్తులు వచ్చాయని సీఎస్ చెప్పారు. ఇందులో ఐదు గ్యారంటీల కోసం 15,88,720 అప్లికేషన్లు రాగా.. ఇతర అంశాలకు సంబంధించి 2,40,387 అప్లికేషన్లు వచ్చాయని వివరించారు. అయితే ఇప్పటివరకు 3868 గ్రామ పంచాయతీలు, 8,697 మున్సిపాలిటీల్లో ప్రజాపాలన కార్యక్రమం పూర్తయిందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button