తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Govorner: ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ సంచలన నిర్ణయం

గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల భర్తీపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని ఆమె నిర్ణయించుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను వివిధ కారణాల రీత్యా గవర్నర్ తమిళి సై రిజెక్ట్ చేశారు.

ALSO READ: అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్

రాజకీయాల్లో చర్చ..

గవర్నర్ తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్‌ 171 ప్రకారం.. తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్‌ చేసిందని.. గవర్నర్‌కు తిరస్కరించే హక్కు లేదని వాదించారు. ఆయా పిటిషన్లపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు గవర్నర్ తమిళి సై ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తమిళి సై తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button