తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS: త్వరలో అన్ని జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించున్నట్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారని, ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వచ్చి కార్యకర్తలను కలుస్తారని వెల్లడించారు. త్వరలోనే ప్రతి జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ఉంటుందని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్టుపై ఫొటో తీశారే తప్పా.. ప్రజల హృదయాల్లో తొలగించలేకపోయిందన్నారు.

ALSO READ:  గులాబీ పార్టీలో లుకలుకలు.. కేటీఆర్, హరీశ్ ముందే భగ్గుమన్న విభేదాలు

పథకాలు రద్దు చేస్తారా..?

కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని హరీష్ రావు చెప్పారు. ఇలాంటి కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామన్నారు. అలాగే బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. ఇప్పటికీ రైతులకు రైతు బంధు వేయకుంటే వారు వ్యవసాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మంచిరోజులు వస్తాయని, ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button