తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Yadadri Temple: భక్తులతో యాదాద్రి కిటకిట.. దర్శనానికి 4గంటల సమయం

వరుసగా సెలవులు రావడంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సోమవారం భక్తులు భారీగా వచ్చారు. నరసింహ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. దీంతో క్యూలో భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది.

ALSO READ: కేటీఆర్ స్వేదపత్రం ప్రజెంటేషన్.. బండ్లగణేష్ కామెంట్స్

భక్తుల కోలాహలం

శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవ భాగంగా మూడవ రోజు ఆలయ మాడ వీధుల్లో శ్రీరామ అలంకారంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఇక లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతోంది. ఆలమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button