![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/XPoSat-Success.jpg)
XPoSat: ఇస్రో ప్రయోగం సక్సెస్.. అమెరికా తర్వాత మనదే విజయం
అద్భుత ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. కొత్త సంవత్సరం రోజు తెల్లవారుజాము చేపట్టిన పీఎస్ ఎల్వీ-సీ58 ప్రయోగం విజయవంతమైంది. ‘ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం’ (XPoSat) ప్రయోగాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read కేటీఆర్ ఆసక్తికర ట్వీట్… ఇది నిజమో? కాదో? మీరే చెప్పండి!
ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి సోమవారం ఉదయం 9.10 గంటలకు ఈ ప్రయోగం ఇస్రో చేపట్టింది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
Also Read కొత్త ఆశలతో స్వాగతం.. ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు
ప్రయోగం చేపట్టిన 21 నిమిషాలకు ఎక్స్ పో శాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. మనదేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను అంతరిక్షంలోకి శాస్త్రవేత్తలు పంపారు. తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజనీర్ శాటిలైట్ కూడా ఉండడం విశేషం. ఈ ప్రయోగం జీవిత కాలం ఐదేళ్లు ఉంటుంది. కృష్ణ బిలాల అన్వేషణ కోసం ఈ ప్రయోగం చేపట్టారు. ఇలాంటి ప్రయోగం అమెరికాకు చెందిన నాసా తర్వాత ఇస్రోనే చేపట్టింది. నాసా 2021లో ఐఎక్స్ పీఈ (IXPE) ప్రయోగం చేపట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.