తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Covid 19: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీగా నమోదవుతున్న కేసులు

కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవలి కాలంలో కొవిడ్ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న క్రమంలో పలు ఆగ్నేయాసియా దేశాలు ఆంక్షలు విధించాయి. ఫేస్ మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ఈ దేశాల్లో అంతర్జాతీయ ప్రయాణికులు, స్థానికులు కోసం విమానాశ్రయంలో తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని కోరారు. ఈ కఠినమైన చర్యల్లో భాగంగా, విమానాశ్రయాలలో టెంపరేచర్ స్కానర్ లను కూడా ఉంచారు. కొవిడ్, ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధికారక వంటి వివిధ రకాల వ్యాధులను తగ్గించేందుకు ప్రస్తుతం ఆ దేశాలు కృషి చేస్తున్నాయి.

Also read: National Energy Conservation Day: నేడే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం

కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలపై సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. కేసుల పెరుగుదలకు జనాభా రోగనిరోధక శక్తి క్షీణించడం, పరస్పర చర్యలతో సహా అనేక కారణాల వల్ల కావచ్చని, పండుగల సీజన్ లో ప్రయాణాలు కావచ్చన్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో 60 శాతానికి పైగా కొవిడ్ 19 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. 21 నవంబర్ 2023 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. స్థానికంగా ఉన్న BA.2.86 లేదా JN.1 రకం వైరస్ అక్కడ వ్యాపిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఇదే తరహాలో ఇండేనేషియా, మలేషియాలోనూ కొవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. కరోనా టీకాలు వేసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని, చేతులను పదే పదే శుభ్రం చేసుకుంటూ ఉండాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని అక్కడి ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇండోనేషియా అధికారులు కొన్ని సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద థర్మల్ స్కానర్‌లను ఏర్పాటు చేశారు. బాటమ్ ఫెర్రీ టెర్మినల్, జకార్తా ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ స్కానర్ లను అందుబాటులో ఉంచారు. SCMP నివేదిక ప్రకారం, వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button