Ayodhya Ram Mandir: అయోధ్యలో పోటెత్తిన భక్తులు.. దొంగల చేతివాటం
అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం వరకు చీమ చిటుక్కుమన్నా పట్టేసిన పోలీసులు.. ప్రాణ ప్రతిష్ఠ వేడుక ముగిసిన తర్వాత బాగా రిలాక్స్ అయ్యారు. హై సెక్యూరిటీ అంతా మాయమైంది. లోకల్ పోలీసులు కూడా కొంచెం సేదతీరారు. దీంతో రెండో రోజు అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదునుగా దొంగల చెలరేగిపోయి.. భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు.
Also read: Ayodhya Ram Mandir: అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. నిలిచిన దర్శనం
ప్రాణప్రతిష్ట కార్యక్రమం వరకు భారీ భద్రతను ఏర్పాటు చేసిన యూపీ సర్కార్ ఇపుడు పూర్తిగా చేతులెత్తేసింది. మంగళవారం నుంచి అయోధ్యలో భక్తులకు ఎంట్రీ ఇవ్వడంతో అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం భక్తులతో కిక్కిరిసిపోయింది. భద్రతను పెంచాల్సిన పోలీసులు అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించారు.
దీంతో వందలాది భక్తుల మొబైల్స్, పర్సులు, బంగారు అభరణాలు చోరీకి గురయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. భక్తుల నుంచి ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు. దీంతో విలువైన వస్తువులు కోల్పోతున్నామని అయోధ్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.