Exit Polls: ఇవాళే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ!
సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం 57 లోక్సభ నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. 18వ లోక్సభను కొలువుదీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పోలింగ్ సమయం పూర్తి కాగానే ఇవాళ సాయంత్రం 6:30 గంటల వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.
ALSO READ: ఏపీ నెక్ట్స్ సీఎం ఎవరు? విశాఖలో జోరుగా సాగుతున్న బెట్టింగ్!
మే 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి. జూన్ 4న వెల్లడయ్యే ఎగ్జాట్ ఫలితాల కంటే ఇవాళ్టి ఎగ్జిట్ ఫలితాలపైనే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. ఎగ్జిట్ ఫలితాలు అధికారం ఎవరిదనే విషయమై కొంత స్పష్టత ఇస్తాయనే అభిప్రాయం జనంలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాలను అనుసరించి భారీగా బెట్టింగ్లు జరిగే అవకాశం ఉంది. ఇక అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతృత్వంలోని కూటమి ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నాయి.
One Comment