Ayodhya Ram Mandir: అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. నిలిచిన దర్శనం
సోమవారం అయోధ్య రామ మందిరంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు అక్కడకు చేరుకోగా ఎవరిని లోని పంపించలేదు. దీంతో స్థానిక హోటళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై రాత్రి స్టే చేసిన రామ భక్తులు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ఆలయం వైపు పోటెత్తారు. దీంతో అధికారులు తెల్లవారుజామున 3 గంటలకు గేట్లు తెరిచి భక్తులను ఆలయంలోనికి అనుమతించారు. ఈ సమయంలో తోపులాట కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రామ భక్తులు ఈ సారి లక్షల్లో ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. భారీ రద్దీ కారణంగా అయోధ్య రామమందిరం ప్రవేశాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
Also read: Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్యకు విలువైన అభరణాలు.. కానుకగా ఇచ్చిన వ్యాపారులు
ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులను దర్శనానికి పంపుతున్నారు. అయోధ్యలోని ప్రధాన రహదారులన్నీ రామ భక్తులతో నిండిపోవడంతో.. పోలీసులు, అయోధ్య నిర్వాహకులు తీసుకున్న తాజా నిర్ణయంలో, అయోధ్య రామమందిర ప్రవేశ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రాత్రి నుంచి చలిలో రాముని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఆలయంలోకి ప్రవేశం కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. పరిస్థితులు కుదుట పడగానే తిరిగి దర్శనం ప్రారంభం అవుతుందని చెప్పుకొస్తున్నారు.