తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Devotees: కిక్కిరిసిన మేడారం.. వనదేవతలకు భక్తుల పూజలు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం నుంచి వరుస సెలవులు రావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర సమీస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సమ్మక్క సారలమ్మ పసుపు, కుంకుమ, చీరసారె, నిలువెత్తు బంగారం( బెల్లం) తో మొక్కులు సమర్పించుకున్నారు.

Also read: Winter Season: తెలంగాణలో చలి పులి పంజా.. వణుకుతున్న ప్రజలు

ఆసియా ఖండంలో జరిగే అతి పెద్ద ఆదివాసీ మహా సమ్మేళనం సమ్మక్క సారలమ్మ జాతర. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతుంది. తాజాగా మేడారం జాతర 2024 తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ మేడారం పరిసరాలను తనిఖీ చేశారు. అలాగే జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి.. భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button