![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/Rocket.jpg)
ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్14 ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహం ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించగా.. మూడు దశలను దాటుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. కాగా, ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందించనుందని ఇస్రో ఛైర్మన్ సోమ్నాథ్ ప్రకటించారు.
ALSO READ: కాళేశ్వరం పాపం వారిదే.. సీఎం రేవంత్ ఫైర్
వాతావరణ అంచనా, విపత్తుల నిర్వహణ..
ప్రస్తుతం అంతరిక్షంలో ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ అనే రెండు థర్డ్ జనరేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాలకు కొనసాగింపుగా ఇన్శాట్–3డీఎస్ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘6 చానెల్ ఇమేజర్’, ‘19 చానెల్ సౌండర్, ‘డాటా రిలే ట్రాన్స్ పాండర్’, ‘సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్ పాండర్’ అనే పేలోడ్లు ఉన్నాయి. ఇది స్పేస్లోకి చేరితే వాతావరణ అంచనా, విపత్తుల నిర్వహణ అంశాల్లో ఇండియా కెపాసిటీ మరింతగా పెరగనుంది.