తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

RBI: వడ్డీ రేట్లను ప్రకటించిన ఆర్బీఐ.. శక్తికాంత దాస్ వెల్లడి

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఐదో సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట లభించింది. ఈ సారి కూడా పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

Also read: December 08: నేడు భారత సాయుధ దళాల పతాక దినోత్సవం

రెపో రేటుతో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటనతో ఈ సారి కూడా రెపో రేటు 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంది.

తాజాగా జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ (మానీటరీ పాలసీ కమిటీ) సమావేశంలో అధికారులు ఈ కీలక విషయాలు తీసుకున్నారు. 2023 ఏడాది ముగింపునకు వచ్చిన క్రమంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందన్నారు. కానీ, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మాత్రం రిస్క్ లోనే కొనసాగుతోందని, దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button