తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Siddipet: భార్యాపిల్లల్ని కాల్చేసి.. తుపాకీతో కాల్చుకుని కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య

తెలంగాణలో (Telangana) మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) గన్ మెన్ ఆత్మహత్య విషయం మరువకముందే మరో గన్ మెన్ (Gunman) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ కలెక్టర్ గన్ మెన్ తన భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి అనంతరం తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో (Siddipet District) చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read ప్రజలకు శుభవార్త.. త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ (Chinnakodur) మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేశ్ (45) సిద్దిపేట కలెక్టర్ (Collector) జీవన్ ప్రశాంత్ పాటిల్ వద్ద గన్ మెన్ గా పని చేస్తుండేవాడు. అతడికి భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ ఉంది. ఎప్పటిలాగే విధులు (Duty) ముగించుకుని గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. అయితే వచ్చేటప్పుడు 9 ఎంఎం పిస్టల్ (Pistol) ఇంటికి తీసుకువచ్చాడు. రాత్రి భార్య, పిల్లల్ని కాల్చేసుకుని అనంతరం అతడు తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read ఏపీ రాజకీయాల్లో ‘పీకే’ చిచ్చు.. మారిన రాజకీయ సమీక‘రణం‘

శుక్రవారం ఉదయం ఎంతకీ ఉద్యోగానికి (Job) రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు (Reasons) తెలియలేదు. ఆర్థిక సమస్యలా, వేధింపులా, కుటుంబ సమస్యలా అనేది తెలుసుకుంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట పోలీసులు (Police) విచారణ చేపడుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button