తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. నిలిచిన విమాన రాకపోకలు

దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల ఎదుటి వ్యక్తులు కూడా కనిపించని విధంగా మారింది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో రన్‌వే విజువల్ రేంజ్(ఆర్‌వీఆర్)ని పొగమంచు ప్రభావితం చేస్తుందని ఐఎండీ తెలిపింది. దీంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లపై తీవ్ర ప్రభావం పడుతోంది. సోమవారం ఉదయం 9.45 గంటల వరకు రన్ వే విజిబిటిలీ 500 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది.

Also read: IIT Bombay: ఐఐటీ బాంబేలో పూర్వ విద్యార్థుల సమ్మేళం.. రూ. 57 కోట్ల విరాళం

పొగమంచు ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ రోజు తెల్లవారుజాము నుంచి విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో పాటు పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. అనేక డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు ఆలస్యంగా నడిచాయి. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) నివేదిక ప్రకారం.. ఈ రోజు ఢిల్లీలో ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. దీని వల్ల విజిబిలిటీ కేవలం 125 మీటర్లకు పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దాదాపు 400కి చేరుకుంది. ఇదిలా ఉంటే బెంగళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా..హైదారబాద్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మళ్లీ బెంగళూర్‌కే మళ్లించారు. ఇక తగ్గిన ఉష్ణోగ్రతలు, పొగమంచు ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button