![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/jadeja-780x452.jpeg)
Ind vs Eng: ముగిసిన రెండో రోజు ఆట… టీమిండియాదే పై చేయి
హైదరాబాద్ టెస్టులో భారత్ ఇంగ్లాండ్ పై భారీ ఆధిక్యం సాధించింది. రెండో రోజు ముగిసేసరికి ఏకంగా 175 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ రోజు రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ భరత్, శ్రేయాస్ అయ్యర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 421 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రీజ్ లో ఆల్ రౌండర్లు జడేజా (81) అక్షర్ పటేల్ (35) ఉన్నారు.
Also Read: ఆస్ట్రేలియన్ ఓపెన్లో జకోవిచ్ ఓటమి… ఫైనల్కి దూసుకెళ్ళిన సిన్నర్
రెండో రోజు ప్రారంభంలో భారత్ జైస్వాల్ వికెట్ ను కోల్పోయింది. పార్ట్ టైం బౌలర్ రూట్ బౌలింగ్ లో స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత రాహుల్ తో కలిసి గిల్ 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఉన్నంత సేపు ఆచితూచి బ్యాటింగ్ చేసిన గిల్.. 23 పరుగుల వద్ద హార్ట్లీ బౌలింగ్ లో ఔటయ్యాడు.
Also Read: అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు.. ఐర్లాండ్ చిత్తు
అంతకముందు టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ 64.3 ఓవర్లలో 246 రన్స్కు ఆలౌటైంది. హిట్ పెయిర్ అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను తిప్పేశారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (88 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) ఒక్కడే ఫిఫ్టీతో సత్తా చాటాడు. జానీ బెయిర్ స్టో (37), బెన్ డకెట్ (35) ఫర్వాలేదనిపించారు. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.