తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India Vs Ireland: అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు.. ఐర్లాండ్ చిత్తు

అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. అదే ఊపుతో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని సాధించారు. ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (118) సెంచరీకి తోడుగా కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహారన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (75) చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 201 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది.

Also read: Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. అరుదైన రికార్డ్ సొంతం

టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. మొదట్లో 80 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే 2 వికెట్లు కోల్పోయిన ఇండియాను ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 156 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి ఆదుకున్నారు. ఒలివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీలె 3, జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నల్లీ 2 వికెట్లు తీశారు. తర్వాత ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 29.4 ఓవర్లలో 100 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. డానియెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (27 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తివారీ 4, సౌమీ పాండే 3 వికెట్లు తీశారు. ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button